సైబర్ నేరాల్లో తెలంగాణే టార్గెట్
ఏపీలో సైబర్ నేరాల నమోదు తక్కువే
దక్షిణాదిలో మన రాష్ట్రంలోనే అధికం
వైద్యులే టార్గెట్ గా ట్రేడింగ్ పేరుతో ఫ్రాడ్స్
కోట్లాది రూపాయలు పోగొట్టుకున్న పలువురు డాక్టర్లు
సైబర్ క్రైమ్ రిఫండ్ లో తెలంగాణ టాప్ అంటున్న టీజీసీఎస్సీ
తెలంగాణలోనే సైబర్ నేరాలు అధికంగా నమోదవుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలలో పోలిస్తే రాష్ట్రంలోనే అధికంగా సైబర్ క్రైమ్ కేసులు నమోదువుతున్నట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నివేదికల్లో తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన హైదరా బాద్ నగరంలో ఉంటున్న వారిఫై సైబర్ దాడులు జరుగు తున్నాయి. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో చాలా తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నట్లు నివేదికల ద్వారా వెల్లడైంది. దేశవ్యాప్తంగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికల ప్రకారం సైబర్ నేరాలలో తెలంగాణ 20.6 శాతంగా కాగా, ఏపీలో 3.6 శాతంగా ఉంది. సైబర్ క్రైమ్ నేరాల ద్వారా 2024లో దేశ వ్యాప్తంగా రూ. 22,812 కోట్లు నష్టపోయినట్లు సైబర్ క్రైమ్ విభాగం తెలిపింది. గతేడాది తెలంగాణలో 1,20,869 మంది పౌరులు సైబర్ క్రైమ్లల బారినపడ్డారని సైబర్ క్రైమ్ నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ క్రైమ్ 2025 ఫిబ్రవరి వరకు రూ.1926 కోట్లు సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు. సైబర్ క్రైమ్ రిఫండ్ లోమాత్రం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) దేశ వ్యాప్తంగా ముందజలో ఉంది. దాదాపు రూ. 200 కోట్ల పైచిలుకు మొత్తం బాధితులకు రిఫండ్ చేసినట్లు టీజీసీఎస్బీ అధికా రులు తెలిపారు.
డాక్టర్లే టార్గెట్ :-
ఇటీవల జరుగుతున్న సైబర్ నేరాలలో అత్యధిక వైద్యరంగంలో ఉన్న వారు కావడం గమనార్హం. రూ.వేలు, రూ.లక్షలు కాదు ఏకంగా రూ.కోట్లు పోగాటుకుంటున్నారు. సైబర్ నేరగాళ్లు వైద్యులను ఎంచుకోవడంలో స్థానికంగా ఉన్న వారి పాత్ర ఉంటుందని సైబర్ క్రైమ్ అధికారులు అనుమానిస్తున్నారు. డాక్టర్ల లావాదేవీలు గురించి క్షుణ్ణంగా తెలిసిన వారు వారి అత్యాశను, భయాలను సైబర్ నేరగాళ్లకు చేరవేసి వారిని దోచుకున్నట్లుగా అర్థమవుతుంది. డాక్టర్ల వద్ద కాజేసిన మొత్తం కూడా ఆన్లైన్ లావాదేవిల ద్వారా జరగడం గమనార్హం. ఇప్పటి వరకు టీజీసీఎస్సీ నమోదైన కేసులలో అధిక మొత్తంలో పోగుట్టుకున్నది డాక్టర్తేనని వెల్లడించారు. డాక్టర్లకు సంబంధించి నమోదైన ఒక్కో కోసులో కోటి రూపాయ లకు పైన పోగుట్టుకున్నట్లు తెలుస్తున్నది.
ఓ డాక్టర్ వద్ద రూ.11 కోట్లు కొట్టేశారు:
ట్రెడింగ్ లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయని నమ్మించి హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీకి చెందిన ఓ డాక్టర్ నుంచి రూ.11.1 కోట్లు 34 విడతలలో కొట్టేశారు. ట్రేడింగ్ ఇన్వెస్ట్ చేయడం అధిక లాభాలు వస్తాయని తెలుపదంతో డాక్టర్ ఇన్వెస్ట్ చేశాడు. 34 విడ తలుగా ట్రెడింగ్ లో ఇన్వెస్టు చేస్తూ వచ్చాడు. దాదాపు నాలుగు నెలల పాటు ఇన్వెస్ట్మెంట్ సాగింది. మీరు ఇన్వెస్ట్ చూసిన షేర్స్ రూ.800కోట్లు లాభం వచ్చినట్లు చూపించారు. డిసెంబర్ నెలలో విత్ డ్రా చేసుకునేందుకు డాక్టర్ ప్రయత్నించగా మరికొంత మొత్తం చెల్లించాలని తెలుపదంతో మోసపోయనని గ్రహించాడు. టీజీసీఎస్బీకి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
డెంటిస్టు నుంచి రూ.1.25కోట్లు స్వాహ..
హైదరాబాద్ కు చెందిన ఓ డెంటిస్టుకు షేర్ల ట్రేడింగ్ లో తాము నిపుణులమని పెట్టుబడిదారులకు మెలకువలు నేర్పించి భారీగా లాభాలొచ్చేలా సలహాలిస్తామని చెప్పారు. వచ్చే లాభాల్లో 15-30శాతం వాటా తీసుకుం టామని తెలిపారు. ట్రేడింగ్ ప్లాట్ ఫామ్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల మాటలను నమ్మి రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక డెంటిస్ట్ నెల రోజుల్లోపు 15 విడతల్లో రూ.1.25 కోట్లను ఆరు బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశారు. కొద్ది రోజులలో సైబర్ నేరగాళ్లు మాట్లాడిన ఫోన్ నెంబర్లు కూడా పనిచేయడం మానేశాయి. దీంతో మోసపోయానని గ్రహించి టీజీసీఎ స్పీకి ఫిర్యాదు చేశారు.
డిజిటల్ అరెస్ట్ పేరుతో డాక్టర్కు రూ.1.23 కోట్లు బురిడీ
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ డాక్టర్ కు డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.1.20 కోట్లు కొల్లగొట్టారు. మే 9 తేదిన డాక్టర్ కు సైబర్ నేరగాళ్లు కాల్ చేశారు. మీ పేరుతో విదేశాలకు వెళ్తున్న పార్సిల్లో 14 పోలీస్ యూనీఫామ్స్, 14 బడీకార్డులు, బ్యాంకు డెబిట్ కార్డులు, మత్తు ఇంజెక్షన్లు ఉన్నాయని, క్రైమ్ బ్రాంచి పోలీసులు సీజ్ చేశారని సైబర్ నేరగాళ్లు ఇండియన్ పోస్టాఫీస్ ముంబై నుంచి మాట్లాడుతున్నట్లు నమ్మిం చారు. పోలీస్ డ్రెస్లో ఉన్న వ్యక్తులు విడతల వారీగా వీడియోకాల్లో మాట్లాడి మీపై డ్రగ్స్ అక్రమ రవాణా, మనీల్యాండరింగ్ కేసులు నమోదయ్యాయని, అరెస్టు చేసి జైలుకు పంపాల్సి ఉంటుందని హెచ్చరించారు. కేసు విచారణలో భాగంగా మీ ఖాతాలు ఆడిట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేయాలని సూచించగా డాక్టర్ విడతల వారిగా సూచించిన బ్యాంకు ఖాతాలకు రూ.1.23 కోట్లు బదిలీ చేశారు. డబ్బు తిరిగి రాకపోవడం, ఎవరూ స్పందించ కపోవడంతో సైబర్ మోసమని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.