Search This Blog

Wednesday, May 18, 2016

25 నుంచి సాధారణ బదిలీలు తెలంగాణలో 18 రోజుల పాటు నిషేధం సడలింపు రెండేళ్లు పూర్తైన వారికి అర్హత ప్రతి విభాగంలో గరిష్ఠంగా 20 శాతం మందికే అవకాశం దస్త్రంపై ఆర్థిక మంత్రి సంతకం పూర్తి సీఎం ఆమోద ముద్ర పడగానే ఉత్తర్వులు




25 నుంచి సాధారణ బదిలీలు
తెలంగాణలో 18 రోజుల పాటు నిషేధం సడలింపు
రెండేళ్లు పూర్తైన వారికి అర్హత
ప్రతి విభాగంలో గరిష్ఠంగా 20 శాతం మందికే అవకాశం
దస్త్రంపై ఆర్థిక మంత్రి సంతకం పూర్తి
సీఎం ఆమోద ముద్ర పడగానే ఉత్తర్వులు
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు ఆతృతగా ఎదురు చూస్తున్న సాధారణ బదిలీలు ఈ నెల 25వ తేదీ నుంచి మొదలు కానున్నాయి. జూన్‌ 11వ తేదీ దాకా కౌన్సెలింగ్‌ విధానంలో బదిలీలు కొనసాగుతాయి. బదిలీల దస్త్రం తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)కి చేరింది. ముఖ్యమంత్రి సంతకం పూర్తికాగానే ఉత్తర్వులు జారీ అవుతాయి. రెండేళ్ల సర్వీసు పూర్తైనవారు బదిలీలకు అర్హులు. ఐదేళ్ల సర్వీసు నిండిన వారికి తప్పక బదిలీ ఉంటుంది. ఆయా విభాగాల్లో బదిలీలు గరిష్ఠంగా 20 శాతానికే పరిమితమవుతాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2013, ఏప్రిల్‌లో నిర్వహించినవే తెలంగాణ ఉద్యోగుల చివరి బదిలీలు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, గవర్నర్‌ పాలన కారణంగా 2014లో బదిలీలు చేపట్టే అవకాశం కలగలేదు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మొదటిసారిగా బదిలీలు నిర్వహించాలని 2015, ఏప్రిల్‌లో ప్రభుత్వం భావించినా.. వివిధ కారణాలతో ఉపాధ్యాయులకు మాత్రం అనుమతి ఇచ్చి మిగతా వారికి విరమించుకొంది. కౌన్సెలింగ్‌ విధానంలోనూ అనేక అక్రమాలకు పాల్పడ్డ వైనాలు ఉమ్మడి రాష్ట్రంలో ఉండటంతోనే సర్కారు అప్పట్లో పునరాలోచనలో పడింది. దీంతో ఆర్థికశాఖనుంచి దస్త్రం సీఎం వద్దకు వెళ్లినా ఆయన సంతకం పూర్తికాలేదు. ప్రభుత్వం అంచనా వేసినట్టుగానే గత ఏడాది కొన్ని ప్రాంతాల్లో ఉపాధ్యాయుల బదిలీల్లో అవకతవకలు చోటుచేసుకొన్నట్టు వెల్లడయ్యింది. జాప్యం నేపథ్యంలో సాధారణ బదిలీలపై ఉద్యోగుల్లో సహజంగానే ఆతృత పెరిగింది. రాష్ట్ర స్థాయి పోస్టుల్లోని ఉద్యోగులను ఉభయ రాష్ట్రాలకు పంపిణీ చేయటం చాలా వరకు పూర్తైనందున ఇప్పుడిక విభజన అడ్డంకులు కూడా ఉండబోవు.
ఆర్థిక మంత్రి సంతకం పూర్తి: ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన దస్త్రంపై తాజాగా ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ సంతకం పూర్తయి అక్కడి నుంచి సీఎస్‌కు చేరింది. ఆ దస్త్రం సీఎస్‌ నుంచి సీఎంకు వెళ్తుంది. సీఎం సంతకం తర్వాత మార్గదర్శకాలు జారీ అవుతాయి. ఉద్యోగుల బదిలీలపై ప్రస్తుతం అమల్లో ఉన్న నిషేధాన్ని మే 25వ తేదీన సడలించి 18 రోజుల తర్వాత మళ్లీ విధిస్తారు.
ప్రతిపాదిత మార్గదర్శకాలు..
పరిపాలన అవసరాల దృష్ట్యా ప్రభుత్వమే బదిలీ చేసే వారు మినహా మిగతా వారిలో బదిలీ కోరుకొనే ఒక్కో ఉద్యోగి నుంచి 3 ఐచ్ఛికాలను స్వీకరిస్తారు.
ఒకే ప్రాంతాన్ని ఒకరికంటే ఎక్కువమంది కోరుకొంటే వారిలో ఎక్కువ సర్వీసు ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
బదిలీకి రెండేళ్ల కనీస సర్వీసు అవసరం. ఒకే ప్రాంతంలో ఐదేళ్లుగా ఉంటున్నవారికి బదిలీ తప్పకుండా ఉంటుంది.
ఆయా శాఖల్లో పనులకు అంతరాయం లేకుండా చూడటంలో భాగంగా ఒక్కో క్యాడర్‌లో బదిలీలను గరిష్ఠంగా 20 శాతానికే పరిమితం చేస్తారు. 20 శాతానికి మించి అభ్యర్థనలు ఉంటే వారిలో ఎక్కువ సర్వీసు గల వారిని పరిగణనలోకి తీసుకొంటారు.

CLICK BELOW TO JOIN IN OUR TGARIEA

MOTIVATIONAL VIDEOS

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top